రైతుల కష్టం దళారుల పాలు పంట రైతులది – బోనస్వ్యా పారులది వ్యవసాయాధికారి అందుబాటులో ఉండట్లేదంటున్న రైతన్నలు

మన న్యూస్: పినపాక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం వారు పండించిన సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాల్ కి ఎ- గ్రేడ్ కి రూ.2320, బి – గ్రేడ్ కి 2300 తో పాటుగా రూ.500 బోనస్ ను అందజేస్తుంది. ఈ బోనస్ రైతులకు చేరేది కొంతైతే మరికొంత ప్రైవేటు వ్యాపారులకు సంబంధిత అధికారుల అండదండలతో చేరుతున్నట్లు ఆరోపణలు బహిర్గతంగానే వెళ్ళు వెత్తుతున్నాయి. పంట పెట్టుబడికై ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు, పురుగుమందులు అప్పుగా తీసుకున్న రైతులు అటు ప్రభుత్వం అందించే బోనస్ కు దూరమవుతూ ఇటు ప్రైవేటు సావుకారులు చెప్పిన రేట్లకే ధాన్యం అమ్ముతూ, వడ్డీలకు వడ్డీలు కడుతూ నష్టపోతున్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు రైతుల భూమి కాగితాలు తీసుకొని కొందరూ, తమ బంధువుల, అనుకూల వ్యక్తుల భూమి కాగితాలు తీసుకొని కొందరు సంబంధిత అధికారుల అండదండలతో వారి పొలాలను కౌలుకు సాగిచేసుకుంటున్నట్లు వ్రాయించి ఐకేపీ, డీసీఎంఎస్, జీసీసీ, సొసైటీ వంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముతున్నట్లు తెలియవస్తుంది. రైతుల వద్ద తక్కువ ధరకు కొనడం, రైతులు తీసుకున్న ఎరువులు పురుగుమందుల కు అసలు, అధికవడ్డీ వసూలు, రైతుల పేర బోనస్ ను ఇలా మూడు విధాలుగా కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల కష్టాన్ని మింగుతున్నారు. రైతులకు కొనుగోలు కేంద్రంలో అందని గన్నీబ్యాగులు దళారులు కొనుగోలు చేసే పంటకల్లాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పంట ఒకరిదీ ఫలితం మరొకరిది.

  • Related Posts

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లీ మండలంలోని సిర్పూర్–మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను బాన్సువాడ సబ్‌ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు.ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం,నగదు తదితరాలను అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని…

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్