

- – జిల్లా టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యులు మేకల కృష్ణ.
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుర్తుకు రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ వైయస్సార్ సిపి నాయకులను ఎద్దేవా చేశారు. 2019-2024 మధ్య ఆ పార్టీ 5 సంవత్సరాల పాలనా కాలంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. నేటి కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను మేకల కృష్ణ తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసారు. నాటి జగన్ పాలనలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్లు, కుటుంబ సభ్యుల గురించి నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల వేదికలపై విమర్శలు చేస్తున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భార్యని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే గుర్తుకు రాని అంబేద్కర్ రాజ్యాంగం వల్లభనేని వంశి, పోసాని కృష్ణమురళీ, బొరుగెడ్డ అనిల్, రాజు కసిరెడ్డి, నాటి ప్రభుత్వంలో పనిచేసిన అవినీతి ఐఏఎస్, ఐపిఎస్ అధికార్లను అరెస్టు చేసినప్పడు మాత్రమే గుర్తుకు రావడం వైయస్సార్ సిపి నాయకుల అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతుందని మేకల కృష్ణ విమర్శించారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టరు సుధాకర్ కరోనా విధుల్లో ఉండి మాస్కు అడిగితే డాక్టర్ను పిచ్చివాడిగా ముద్రవేసి చంపారని, సీతానగరంలో ఒక దళితయువకుడు ఆక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్న, పోలీసు స్టేషన్లోనే ప్రశ్నించిన పాపానికి దళిత యువకుడికి స్దానిక వైయస్సార్సిపి నాయకులు శిరోముండనం చేసి, ఆ బాధితుడిపైనే అక్రమ కేసులు పెడితే బాధితుడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగమే కదా నడిచించింది. అప్పుడు భారత రాజ్యాంగం ఎందుకు గుర్తుకు రాలేదని కృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణ సానుభూతితోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో అఖండంగా మెజార్టీతో గెలిపించి పరిపాలన జగన్ చేతికి అందిస్తే 2019 – 2024 లో ఐదేళ్లూ ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి, యితర పార్టీల నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి గ్రామల నుండి పారిపోయే విధంగా వేదించిన, చంపేసిన దాఖాలాలు వైయస్సార్ నాయకులు మర్చిపోతే ఎలా అని మేకల కృష్ణ నిలదీశారు. మీ ప్రభుత్వ పాలనలో మీరు అమలు చేయని అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేడు అమలు జరపమంటే ఎలా… మీ పాలనలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల సొంత ఆస్తులను వైఎస్ఆర్సిపి నాయకులు, నాటి ఎమ్మెల్యేలు, ఎంపీలు దౌర్జన్యంగా తీసుకున్న సంఘటనలను ఇప్పటికింకా ప్రజలు మర్చిపోలేదని, అదే విధంగా పరిపాలననను సర్వనాశనం చేసిన దాఖలాలు అనేకమైనవి ఉన్నాయని, అక్రమ మద్యం పాలసీతో లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుగొమ్మలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాస్కు అడిగినందుకు నర్సీపట్నం డాక్టరును కొట్టి చంపిన దాఖలాలు, అదేవిధంగా రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలపైన కుల, మతాలకు అతీతంగా దాడులు చేసి ఎన్నో అరాచకాలు చేశారని అటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని, అనాడు జగన్ ప్రభుత్వంలో రాజారెడ్డి పాలన కొనసాగింది కాబట్టే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైందని దెప్పి పొడిచారు. ప్రభుత్వం ముసుగులో 2019-2024 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాలనలో అక్రమాలకు పాల్పడిన నాయకులను, అధికార్లను నేటి కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగ పాలనని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే బాగుంటుందని జిల్లా టెలి కమ్యూనికేషన్ సలహా మండలి సభ్యులు మేకల కృష్ణ హితవు పలికారు.