చంద్రబాబు ఏడాది పాలన అంతా అరాచకమే!

  • హామీల పేరుతో 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు
  • వైసిపి కో ఆర్టినేటర్ ముద్రగడగిరి బాబు

శంఖవరం / ప్రత్తిపాడు మనన్యూస్ (అపురూప్) : చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా ఆరాచకమే అని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై బుక్ లెట్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిబాబు మాట్లాడుతూ గత ఐదేళ్ల జగనన్న పాలనను చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారన్నారు. జగనన్న హాయంలో రాష్ట్రంలో నవరత్నాల పేరుతో ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. అవినీతి లేకుండా మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హుల ఆకౌంట్లలో నిధులు జమ అయ్యాయన్నారు. రెండేళ్ల కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత జగనన్నకే దక్కిందన్నారు. ఏడాది పాలనలో మహిళలను దగా చేశారని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి సురేష్, గొల్లపల్లి కాశి, గుమ్ములూరి రమణ, యిజనగిరి ప్రసాద్, అల్లం ఆదినారాయణ, మజ్జూరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.