ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్,కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్,ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు,ఎన్టీఆర్ అభిమానులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం మనదేశం విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర మంతటా ఘనంగా జరిగాయని తెలిపారు.ఈసందర్భంగా అడపా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు, సాయిరామ్ వర్మ,జగదీష్ లను భారీ గజమాలతో సత్కరించారు.ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు,లోకేష్,టీడీ జనార్థన్,ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్నా ఎన్టీఆర్ జనార్థన్ కేరేజ్ 922వ రోజు అయ్యప్ప స్వాములకి, పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు.సాయిరామ్ వర్మ, జి.శ్రీనివాసరావు,గూడెం అప్పారావు(బుజ్జి) సమకూర్చిన 5 కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు.ఈ కార్యక్రమంలో బొక్కా నూకరాజు,మండపాక శ్రీనివాసరావు,ఎన్టీఆర్ అభిమానులు,ఫౌండేషన్ సభ్యులు,తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు