రెడ్ బుక్ రాజ్యాంగంలో మీడియాకు రక్షణ లేదు ………..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు: రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు.- మీడియా మీద కక్షసాధింపులు.- కొమ్మినేని అరెస్ట్ పత్రికాస్వేచ్చపై దాడి.: వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం.మన న్యూస్, నెల్లూరు ,జూన్ 9:నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.- రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సంస్థలపై దాడులు.- రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీడియాకు రక్షణ లేదు.- శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలం.- పాలనా వైఫల్యాని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్.: వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం.కూటమి పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితిలు కనిపిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిటీవీ డిబేట్‌లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక ప్రకారం వివాదంగా మార్చి, సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం చూస్తుంటే పత్రికా స్వేచ్చను ఈ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెడుతున్నారనే విషయం అర్థమవుతోందని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేన్నారంటే…ప్రజాసమస్యలను మీడియా చానెల్స్ లైవ్ డిబేట్ల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటాయి. ఈ డిబేట్‌లో సమకాలీన సమస్యలను మేధావులతో చర్చిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో విశ్లేషకులు అసందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే సరిచేసుకోవడం, కొన్ని సందర్భాల్లో వాటికి క్షమాపణలు చెప్పడం కూడా చూస్తున్నాం. ఇదే క్రమంలో ఈనెల ఆరో తేదీన సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ దేశంలో సెక్స్‌ వర్కర్ల సంఖ్యలో కర్ణాటక ప్రధమ స్థానంలో ఉంటే, ఏపీ రెండో స్థానంలో ఉందని మాట్లాడారు. మన రాష్ట్రం గొప్పగా ఉందని పాలకులు చెబుతున్నారు, సెక్స్ వర్కర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, దీనిని కంట్రోల్ చేయాలనే దోరణితో ఆయన మాట్లాడారు. వెంటనే ప్రజంటేటర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన వ్యాఖ్యలను వారించారు. ఇలాంటి పదాలు మాట్లాడటం గౌరవంగా ఉండదు అని అడ్డు చెప్పారు. దీనిపై కొందరు కావాలనే రాద్దాంతం చేస్తుండటంతో అటు సాక్షిటీవీ యాజమాన్యం, ఇటు వైయస్ఆర్‌సీపీ కూడా దీనిని ఖండించింది. మహిళల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా వెల్లడించింది అని అన్నారు.పథకం ప్రకారం రాద్దాంతాన్ని సృష్టించారు అని అన్నారు.టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఏడో తేదీన ప్రజల్లోకి తప్పుగా తీసుకుని వెళ్లి, రెచ్చగొట్టే దోరణితో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసేందుకు తెగబడింది. దీనిలో భాగంగానే ఏడో తేదీ సాయంత్రం 3.09 గంటల సమయంలో మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ లో దీనిపై పోస్ట్ పెట్టారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలకు దిగారు. అదే రోజు ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు తన మాటలకు క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత 8వ తేదీన టీడీపీకి చెందిన సోషల్ మీడియా ఈ అంశాన్ని సాక్షిటీవీ యాజమాన్యానికి, వైయస్ జగన్, ఆయన సతీమణి భారతమ్మకి ఆపాదిస్తూ అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననంకు పాల్పడింది. తరువాత సీఎం చంద్రబాబు స్పందిస్తూ కృష్ణంరాజు వ్యాఖ్యలను తాను సహించను, చర్యలు తీసుకుంటానంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆ తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయడం, తరువాత ట్విట్టర్‌లో స్పందించారు. ఆ వెంటనే ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైయస్ జగన్‌పై విషం చిమ్మిన విషయం మరిచిపోయారా?టీడీపీకి చెందిన సోషల్ మీడియాలో వైయస్ జగన్‌, ఆయన కుటుంబంపై ఎటువంటి విషపూరితమైన ప్రచారం చేశారో అందరికీ తెలుసు. తెలుగుదేశంకు అనుకూలమైన పత్రికల్లో ఆయన కుటుంబంపై దారుణమైన కథనాలను ప్రచురించారు. అయినా ఏ ఒక్కరిపైనా ఆయన కక్షసాధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తోంది. ప్రతిపక్షంలోని ప్రతి ఒక్కరినీ కేసులు పెట్టి వేధించాలి, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. చివరికి సీనియర్ జర్నలిస్ట్‌ కొమ్మినేని వంటి వారిని అరెస్ట్ చేయడం ద్వారా పత్రికలను, మీడియాను కూడా వదలిపెట్టమనే సంకేతాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్‌ను ముందుకు తీసుకువస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా మీడియాను నియంత్రించాలనే దుర్మార్గంతో ఎవరూ పనిచేయలేదు.సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి అని అన్నారు.రాష్ట్రంలో నేడు రాక్షసపాలన సాగుతోంది. ఈ రోజు సాక్షిమీడియాకు చెందిన అన్ని కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని మీడియా సంస్థలపైనా ఇలాంటి నిర్భందమే కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తీసుకువచ్చారు. ఏడాది పాలనపై వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంకు ప్రజాస్పందన వస్తే, సంబరాలు చేసుకుందామన్న కూటమి పార్టీల పిలుపును ప్రజలు తిరస్కరించారు. దానిని డైవర్ట్ చేసేందుకే నేడు సాక్షి మీడియాపై ఈ దాడులు అని అన్నారు. శాంతిభద్రతలు పట్టవా?అనంతపురం జిల్లాలో గిరిజన బాలిక తన్మయిని దుండగులు బీరు బాటిళ్ళతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌పై ఆరు రోజుల కిందట ఫిర్యాదు అందినా, పోలీసులు పట్టించుకోలేదు. చివరికి దారుణమైన స్థితిలో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి రాష్ట్రంలో పోలీసింగ్ ఎక్కడ ఉంది? సత్యసాయి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్ధినిపై సామూహిక అత్యాచారంకు పాల్పడిన తెలుగుదేశం కార్యకర్తలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. కేసు పెట్టేందుకు వచ్చిన బాధితులను బెదిరిస్తే వారు ఊరు వదిలి వెళ్ళిపోయారు. శాంతిభద్రతల విషయంలో విఫలమైన ఇటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. హోంమంత్రి వంగలపూడి అనితను కీలుబొమ్మ మంత్రిగా మార్చారు. నారా లోకేష్ డిఫాక్టో హోంమంత్రిగా వ్యవహరస్తున్నారు అని అన్నారు.వైయస్ఆర్‌సీపీలోని పలువురు మహిళా ప్రజాప్రతినిధుల గురించి గతంలో టీడీపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మరిచిపోయారా? సీఎంగా ఉన్న వైయస్ జగన్ పై టీడీపీ నాయకులు వాడిన భాష ఎలాంటిది? వంగలపూడి అనిత వైయస్ జగన్ కుటుంబసభ్యుల గురించి ఎలాంటి మాటలు మాట్లాడారు, కిరాక్‌ ఆర్పీ, సీమరాజా, కిరణ్ వంటి వారు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారికి టీడీపీ కొమ్ముకాస్తోంది అని అన్నారు.

  • Related Posts

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ వారు జిల్లాలో గంజాయిని మరియు జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నిర్ములించుటకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, నేషనల్…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    శంఖవరం మన న్యూస్ అపురూప్ : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని కోటనందూరు – కత్తిపూడి గ్రామాల మధ్యలోని రోడ్లు భవనాల శాఖ రహదారి మార్గం (సర్వీస్ రోడ్డు)పై రౌతులపూడి మండలం రాఘవపట్నం, గుమ్మరేగుల, సంతపైడిపాల, ములగపూడి, మాతయ్యపేట, ఉప్పంపాలెం,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి