సీఎం దార్శనికతో సమగ్రాభివృద్ధి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- పేదరికాన్ని నిర్మూలించేందుకు పక్కా ప్రణాళిక.- పి4 విధానంతో పేదలను ధనికులుగా మార్చేలా సీఎం కృషి.- 10 సూత్రాల అమలుతో స్వర్ణాంధ్ర 2047 సాకారం.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను అమలు చేయనున్నారని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో విజన్‌ 2020 ను ఏవిధంగా అమలు చేశారో.. నేడు స్వర్ణాంధ్ర 2047ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 10 సూత్రాల ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ క్రతువులో ఎంపీలు, ఎమ్మెల్యేలను అందరినీ భాగస్వాములను చేస్తున్నారన్నారు. ఐదుమంది బృందంతో నియోజకవర్గం యాక్షన్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నారన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజల అవసరాల మేరకు యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నామన్నారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఈ విజన్‌ను ముందుకు తీసుకువెళతామన్నారు. సీఎం చంద్రబాబు కలలను సాకారం చేసేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తో పాటు ఐదు మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌, నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు (09-06-2025, సోమవారం) రాత్రి 8 గంటలకు శేష వాహన సేవ భక్తిపూర్వకంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో స్వామివారు ఆది…

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ వారు జిల్లాలో గంజాయిని మరియు జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నిర్ములించుటకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, నేషనల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి