సీఎం దార్శనికతో సమగ్రాభివృద్ధి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- పేదరికాన్ని నిర్మూలించేందుకు పక్కా ప్రణాళిక.- పి4 విధానంతో పేదలను ధనికులుగా మార్చేలా సీఎం కృషి.- 10 సూత్రాల అమలుతో స్వర్ణాంధ్ర 2047 సాకారం.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను అమలు చేయనున్నారని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో విజన్‌ 2020 ను ఏవిధంగా అమలు చేశారో.. నేడు స్వర్ణాంధ్ర 2047ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 10 సూత్రాల ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ క్రతువులో ఎంపీలు, ఎమ్మెల్యేలను అందరినీ భాగస్వాములను చేస్తున్నారన్నారు. ఐదుమంది బృందంతో నియోజకవర్గం యాక్షన్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నారన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజల అవసరాల మేరకు యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నామన్నారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఈ విజన్‌ను ముందుకు తీసుకువెళతామన్నారు. సీఎం చంద్రబాబు కలలను సాకారం చేసేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తో పాటు ఐదు మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌, నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//