

మన న్యూస్, గూడూరు :.వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరీగ మురళీధర్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో విద్యానగర్ లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళ్యాణ భవనం యందు సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ…….. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన క్రమంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలు జరుపకపోవడంతో వెన్నుపోటు దినం కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా మేరిగా మురళీధర్ చెప్పారు.రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఉన్న కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించేందుకు ఈ వెన్ను పోటు కార్యక్రమం ద్వారా ప్రణాళిక సిద్ధం చేసుకుంటానని భరోసా ఇచ్చారు. జూన్ 4వ తేదీన అనగా బుధవారం నాడు గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చి కార్యకర్తలతో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరుగుతుందని మేరీగ మురళీధర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి సన్నారెడ్డి చెంచు రాఘవ రెడ్డి , పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి , బద్దిగ వెంకట రమణయ్య, ఆశ శ్రీనివాసులు,చెన్నారెడ్డి బాబురెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి ఎంపీపీ దాసరి అంజమ్మ . జడ్పిటిసి దాసరి కోటయ్య నరమాల రమణయ్య రాజా రెడ్డి. దువ్వూరు రమణారెడ్డి. పాపా రెడ్డి రాజశేఖర్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి ప్రసాద్ గౌడ్. దువ్వూరు మధు రెడ్డి. ఏనుగు సుధాకర్ నాయుడు. కామిరెడ్డి కస్తూరి రెడ్డి. చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి. కార్తీక్ రెడ్డి,షనీల్ రెడ్డి. కస్తూరయ్య యాదవ్. దేవా రెడ్డి నాగూర్ రెడ్డి. పరంధామ రెడ్డి. దువ్వూరు శేషు రెడ్డి, చంద్రారెడ్డి. పాముల సురేంద్ర. కనుపూరు జగదీష్. మల్లి శీ నయ్య. దువ్వూరు లోకేష్ రెడ్డి. కళ్యాణ్ రెడ్డి. కోటారెడ్డి. దువ్వూరు అనిల్ రెడ్డి, మూడు మండలాల వైకాపా నాయకులు కార్యకర్తలు మండల కమిటీ నాయకులు. ఎంపీటీసీలు. సర్పంచులు. సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
