జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్, నెల్లూరు ,మే 25:- *నెల్లూరు పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమైన రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి *ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం. *కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం.*మంత్రి కుమార్తె షరణి కి ఘనంగా స్వాగతం పలికిన పదో డివిజన్ టిడిపి శ్రేణులు.జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకోవడం తమ బాధ్యత అని, ఇందుకోసం కార్యకర్తల సంక్షేమంతో పాటు నెల్లూరు నగర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మంత్రి కుమార్తె షరణి తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ కుమార్తె షరణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకి టిడిపి శ్రేణులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడుతూ….. జరిగిన ఎన్నికల్లో మంత్రి నారాయణ కోసం జెండా పట్టి ఎవరైతే నిరంతరం కష్టపడ్డారో వారి రుణం తీసుకునేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పలు సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చారని వాటన్నిటిని పరిష్కరించేందుకు అంచెలంచలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల కృషి ఫలితమే మంత్రి నారాయణకి 10వ డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేలా చేసిందన్నారు. అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు నారాయణ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇందుకు విశేషంగా కృషి చేస్తున్న తిరుమల నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చిన తమను కార్యకర్తలు సంప్రదించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుతో పాటు .. డివిజన్ అధ్యక్షులు వెంకటరావు,బూత్ కన్వీనర్ గురు ప్రసాద్..మల్లి కార్జున.. శ్రీనివాస్ యాదవ్.. హారి,బాబు,రమేష్, రవి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర