జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్, నెల్లూరు ,మే 25:- *నెల్లూరు పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమైన రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి *ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం. *కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం.*మంత్రి కుమార్తె షరణి కి ఘనంగా స్వాగతం పలికిన పదో డివిజన్ టిడిపి శ్రేణులు.జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకోవడం తమ బాధ్యత అని, ఇందుకోసం కార్యకర్తల సంక్షేమంతో పాటు నెల్లూరు నగర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మంత్రి కుమార్తె షరణి తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ కుమార్తె షరణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకి టిడిపి శ్రేణులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడుతూ….. జరిగిన ఎన్నికల్లో మంత్రి నారాయణ కోసం జెండా పట్టి ఎవరైతే నిరంతరం కష్టపడ్డారో వారి రుణం తీసుకునేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పలు సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చారని వాటన్నిటిని పరిష్కరించేందుకు అంచెలంచలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల కృషి ఫలితమే మంత్రి నారాయణకి 10వ డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేలా చేసిందన్నారు. అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు నారాయణ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇందుకు విశేషంగా కృషి చేస్తున్న తిరుమల నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చిన తమను కార్యకర్తలు సంప్రదించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుతో పాటు .. డివిజన్ అధ్యక్షులు వెంకటరావు,బూత్ కన్వీనర్ గురు ప్రసాద్..మల్లి కార్జున.. శ్రీనివాస్ యాదవ్.. హారి,బాబు,రమేష్, రవి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా