

మన న్యూస్ నెల్లూరు మే 25:దేశంలోనే ది బెస్ట్ మోడల్ స్కూల్ గా వి.ఆర్.సి పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో చేపడుతున్న స్కూల్ ఆధునీకరణ పనులను పొంగూరు షరణి పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని ఎన్సీసీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా షరణి మీడియాతో మాట్లాడుతూ…… మా నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని.., ఆపేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసన్నారు. ఎన్నికల సమయంలో పేద పిల్లల పరిస్థితి చూసి మాట ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే పనులు శరవేగంగా చేస్తున్నారన్నారు. 1975 లో పురుడుపోసుకున్న వీఆర్ హైస్కూల్ ని వైఎస్సార్సీపీ మూసేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మూతపడ్డ వీఆర్ హై స్కూల్ ని ఓపెన్ చేసేందుకు ఎంచుకొన్నారని.. ప్రతీ పేద విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో మంత్రి నారాయణ ముందుకు వెళ్తున్నారన్నారు. స్కూల్ ఆధునీకరణ పర్యవేక్షణ బాధ్యతలు తనకు అప్పగించారన్నారు. జూన్ 12 న స్కూల్ ప్రారంభమౌతుందని. ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలు కల్పించబోతున్నామన్నారు. దేశంలోనే బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దాలన్నదే మా నాన్న సంకల్పం అని ఆమె వెల్లడించారు. ఎన్సీసీ సిబ్బంది పనులను వేగంగా చేస్తున్నారని, సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 కింద కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. రోబోటిక్ లాబ్ , కంప్యూటర్ ల్యాబ్ , సైన్స్ ల్యాబ్ , నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారని.. వీఆర్సి హై స్కూల్ ను రోల్ మోడల్ గా నిలబెట్టి మాట నిలబెట్టుకొంటామన్నారు..






