అరుణోదయ 50 వసంతాల ముగింపు సభలను జయప్రదం చేయండి-బి.రమేష్

మన న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య 50 వసంతాల ముగింపు సభల కరపత్రాలను మండల కేంద్రం గొల్లప్రోలు, జగనన్న కాలనీలో ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ…
భూమి, భుక్తి ఈ దేశ విముక్తి కోసం సాగిన పోరాటాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన కలలతో ప్రజలను చైతన్య పరుస్తూ కీలక భూమిక పోషించిందని ఆయన తెలిపారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉస్మానియా యూనివర్సిటీలో 1974లో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ సారథ్యంలో పురుడు పోసుకొని 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2024 డిసెంబర్లో హైదరాబాదులో పెద్ద ఎత్తున సభలను నిర్వహించడం జరిగిందని,దాన్ని కొనసాగింపు ఈనెల 12వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముగింపు సభ జరుపుకుంటుందని,ఈ సభను ప్రజా కళాకారులు, విప్లవ సానుభూతిపరులు, విద్యార్థి, మేధావులు,కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మధ్యభారత్ అడుగుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఆదివాసుల హత్యలు కార్పొరేట్ కంపెనీలకు అడవుల్లోని ఖనిజ సంపదను దోచిపెట్టడానికే అని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, అలాగే చత్తీస్‌గఢ్ లోని కర్రె గుట్టలను చుట్టుముట్టిన వేలాది మంది సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు,
ఎ ఐ ఎఫ్ టు యు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పి డి ఎస్ యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు డి. నారాయణమూర్తి, గొర్ల శివ, కే .శ్రీధర్ , వేగిశెట్టి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///