శంఖవరం ఘటనపై జిల్లా ఎస్పీని కలిసిన దళిత నేతలు…

మన న్యూస్ కాకినాడ (అపురూప్) : శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దోషులందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి, దళిత సంఘాల నేతలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను కోరారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ను నేతలు కలిసి శంఖవరం సంఘటనపై జరుగుతున్న పరిణామాలను ఎస్పీకు వివరించారు. పోలీసులు ఈ కేసులో సర్వయంగా దర్యాప్తు చేసి దొండగుడు పడాల వాసు ను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అయితే దుండగుడు పడాల వాసుతోపాటు మరి కొంతమంది ఈ ఘటనలో పాల్గొన్నందున వారిపై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. దుండగులపై అట్రాసిటీ కేసుతోపాటు రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని, నిందితులను కాపాడేందుకు ప్రయత్నం చేయొద్దని అన్నారు. దీనిపై స్పందించిన ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరిపి వేగవంతంగా నిందితుడిని పట్టుకున్నామని, నేతలు తెలిపిన అంశాలపై కూడా దర్యాప్తు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిన్య సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ భానుమతి, నవీన్ రాజ్, ఉపాధ్యక్షులు పిల్లి రామారావు, కోశాధికారి రాజా రాంజి, సభ్యులు నాగేశ్వరరావు, దళిత సంఘ నాయకులు పండు అశోక్ కుమార్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///