

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, అమేర్థ గ్రామపంచాయతీ గ్రామసభలో దర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతరం సురేష్ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు, ఇతడు ముండా జాతికి చెందిన వాడు, 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవీక ప్రాంతంలో, బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరి యన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు, తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు, ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులో ని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది, ఈ విధంగా సత్కరింప బడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా, బిర్సా ముండా 1875 నవంబర్ 15 ఉలి హాట్, రాంచీ, జన్మించాడు,
19 00 జూన్ రాంచీ జైలులో మరణించారు, బ్రిటిష్ వలస బాదం పై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు, కనీసం పాతికేళ్ళు కూడా దాటకుండా నే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్ట మైనది, బిర్సా ముండా నవంబర్ 15 /1875 గురువారం రోజున జన్మించాడు, అప్పట్లో ఆచరణలో ఉన్న ముండా ప్రజల ఆచారం ప్రకారం ఆయన పుట్టిన రోజులు బట్టి పేరు పెట్టారు, జానపద గేయాలలో కూడా ఈయన జన్మస్థలం ఉలి హాటు లేదాచల్కడ్ అన్ని ఆయోమాయం నెలకొన్నది, బిర్సా ముండా అన్నా కొమ్ట ముండానీ నివసించి ఉండటం వల్ల ఆయన ఇల్లు ఇంకా అక్కడ శిథిల వ్యవస్థలో ఉండటం వల్ల ఈయన ఉలి హాటు లో జన్మించాడన్న వాదన ఉంది బిర్సా ముండా తండ్రి సుగుణ ముండా, తల్లి కర్మి హాటు అతని తమ్ముడు పస్నా ముండా ఉలి హాటు ను వదలి కూలి పని కోసం బిర్బంకీ వద్ద ఉన్న కురుబ్దంలో స్థిరపడ్డారు, అని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో
అమేర్ధ గ్రామపంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు