మన న్యూస్: భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్స ముండా అని పినపాక గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. నవంబర్ 2024న బిర్స ముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా పినపాక గ్రామపంచాయతీ నందు ఏర్పాటుచేసిన గ్రామసభకు ఎంపీడీవో రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని,19వ శతాబ్దపు చివరి రోజుల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలియనేరియన్ ఉద్యమానికి సారిధ్యం వహించాడని, 22 ఏళ్ళ వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించాడని తద్వారా స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిన ఆయన గౌరవార్థం భారత పార్లమెంటులో సెంట్రల్ హాల్లో అతని చిత్రపటం కూడా ఉంచారని తెలిపారు. బిర్స ముండా జయంతిని పురస్కరించుకొని గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తుల చేత పరిసరాల పరిశుభ్రత గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలన, స్వచ్ఛమైన గ్రామ సంకల్పానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సభలో పాల్గొన్న గిరిజనులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *