వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం,,ప్రారంభించిన సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య,

మనన్యూస్,ప్రత్తిపాడు:దుర్గా శ్రీనివాస్ గర్భిణీ స్త్రీలకు,రోగులకు దాహార్తి తీర్చేందుకు వివేకానంద సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని,వైస్ చైర్మన్ బొల్లు చిన్నోడు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్నందువలన ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు,రోగులు డీహైడ్రేషన్ కి గురి కాకుండా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గర్భిణీలు గర్భిణీ స్త్రీలు,రోగులు ఉపయోగించుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం చలివేంద్రం ద్వారా మజ్జిగ అందించడంతో పాటు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వర్మ సహకారంతో త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామన్నారు.అలాగే రానున్న రోజుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కటారి దుర్గా మల్లేశ్వర సాగర్,బొల్లు మనోజ్ బాబు,వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు