

శంఖవరం మన న్యూస్ (అపురూప్)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంఖవరం నందు 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ క్లాసు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విజయవంతంగా ముగిసిందని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. కృష్ణవేణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ అవగాహన సదస్సులో ఓఎంఆర్ లో పరీక్ష రాసే విధానం మరియు ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందని అన్నారు. 6వ తరగతి ప్రవేశపరీక్షకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ అవగాహన సదస్సు లో పాల్గొన్నారు.