రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ సందర్భంగా అమరావతికి 15వేల కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సహకారంతో ఏపీకి అందించనుంది.

ఈ క్రమంలో 15వేల కోట్లను ఎలా వినియోగిస్తామన్న దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా రూ.15వేల కోట్ల రుణ సహకారం అందిస్తాయన్న ప్రభుత్వం.. ఈ నిధులను ఉపయోగించి అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అమరావతికి వరద ముప్పు రాకుండా ఉండేలా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, రోడ్లు, డక్ట్ లు, అలాగే డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులు చేపట్టాలని సూచించింది.

మరోవైపు అమరావతి నగరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విడతల వారీగా ఈ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 11, 12 తేదీలలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ ఒప్పందం చేసుకోనున్నారు.

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తాయని ఇప్పటివరకు ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.15వేల కోట్ల రుణంపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నిధుల వినియోగం ఏ విధంగా ఉంటుంది, నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనే దానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ కలిపి రూ.15వేల కోట్లు రుణంగా ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక సాయం పొందడానికి సీఆర్డీయేకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Related Posts

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని…

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మన న్యూస్ సింగరాయకొండ:-జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారతీయ పౌరులకు సంతాపం తెలియజేస్తూ మృతులకు జనసేన పార్టీ పక్షాన సంతాప కార్యక్రమం కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 3 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్