రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ సందర్భంగా అమరావతికి 15వేల కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సహకారంతో ఏపీకి అందించనుంది.

ఈ క్రమంలో 15వేల కోట్లను ఎలా వినియోగిస్తామన్న దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా రూ.15వేల కోట్ల రుణ సహకారం అందిస్తాయన్న ప్రభుత్వం.. ఈ నిధులను ఉపయోగించి అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అమరావతికి వరద ముప్పు రాకుండా ఉండేలా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, రోడ్లు, డక్ట్ లు, అలాగే డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులు చేపట్టాలని సూచించింది.

మరోవైపు అమరావతి నగరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విడతల వారీగా ఈ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 11, 12 తేదీలలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ ఒప్పందం చేసుకోనున్నారు.

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తాయని ఇప్పటివరకు ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.15వేల కోట్ల రుణంపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నిధుల వినియోగం ఏ విధంగా ఉంటుంది, నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనే దానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ కలిపి రూ.15వేల కోట్లు రుణంగా ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక సాయం పొందడానికి సీఆర్డీయేకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ