

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాజకీయంగా మారింది. గత నెల రోజులుగా విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఆటలు ఆడుకుంటున్నారు.600 మందికి పైగా విద్యార్థులు పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోచదువులు సాగిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం నిర్వాహకులు సక్రమంగా వంటలు చేయడం లేదని, ఆ వంటలు పిల్లలకు రుచించడం లేదని పలువురు తల్లిదండ్రులు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పట్టించుకోకపోవడంతో పిల్లలు కోసం కొంతమంది తెలుగుదేశం నాయకులు పట్టుబట్టి పాత వంట నిర్వాహకులును తొలగించి కొత్తవారిని వేయడానికి పావులు కదుపుతున్నారు. కానీ పిల్లలు మాత్రం వంట నిర్వాహకులు సక్రమంగానే వంటలు చేస్తున్నారని, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని కొంతమంది పిల్లలు చెబుతున్నారు. మరి కొంతమంది మాకు వద్దు కొత్తవారు కావాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రంగంలోకి దిగి మండల విద్యాశాఖ అధికారి త్రీ మాన్ కమిటీని మంగళవారం నాడు హైస్కూల్ కు పంపించారు. విచారణ జరిపి నివేదిక పంపించమని మండల విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. హై స్కూల్ వద్ద విచారణ సమయంలో గందరగోళంగా మారింది. కొంతమంది పిల్లలు వంట నిర్వాహకులు వద్దని, మరి కొంతమంది కావాలని తేల్చి చెప్పడంతో తాసిల్దార్ రవి, ఎంపీడీవో పట్నాయక్, ఎంఈఓ జోగారావు, ప్రధాన ఉపాధ్యాయులు ఈశ్వరరావు విచారణ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ యడ్ల రమేష్ విలేకరులతో మాట్లాడుతూ వంట నిర్వాహకుల కమిటీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని అధికారులను కోరగా, పిల్లలు భోజనం బాగు లేదంటే మేము నిర్వాహకులను తొలగిస్తామని లేదంటే తొలగించడం జరగదని ఎంపీడీవో,తాసిల్దారు, విద్యాశాఖ అధికారి తెలిపారు. మరొకసారి విచారణ జరిపి హై స్కూల్ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వంట నిర్వహకులు కొంతమంది నాయకులు మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపై పలువురు తల్లిదండ్రులు ఈ విధంగా ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని పెదవి విరుస్తున్నారు.
