పంటల కు బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు పండించే మొక్కజొన్న,పెసర పంటలకు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు. పాచిపెంట మండలం లో కుడుమూరు గ్రామం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ పంటలపై బ్యాంకులో రుణాలు తీసుకోని రైతులు సమీప మీసేవ సెంటర్లో గానీ, పంటల భీమా పోర్టల్ లో గాని,పోస్ట్ ఆఫీస్ లో గాని, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గాని పంటల భీమా చెల్లించవచ్చని ఆధార్ కార్డ్ షోయింగ్ సర్టిఫికెట్ పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకు ఎకౌంటు పుస్తకం జిరాక్స్లు తీసుకొని వెళితే మొక్కజొన్నకు 72 రూపాయలు 40 రూపాయలు ఎకరానికి చెల్లించి పంటల భీమా పొందవచ్చునే తెలిపారు. వరి పంటకు డిసెంబరు 31 వరకు సమయం ఉందని మొక్కజొన్న పెసర పంటలకు డిసెంబర్ 15 ఆఖరి రోజున తెలిపారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా,అనుకోని విధంగా వరదలు కరువు వడగల్లు లేదా అగ్ని ప్రమాదాల ద్వారా నష్టపోయినట్లయితే 48 గంటలలోగా సంబంధిత భీమా అధికారికి తెలియజేసి పంటల బీమా పొందవచ్చని తెలిపారు.పంటల బీమా ద్వారా మొక్కజొన్నకు గరిష్టంగా 36000 పెసర పంటకు 20,000 వరి పంటకు 42000 తెలిపారు ఊహించని అవంతరాలు వచ్చినప్పుడు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కాబట్టి రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు.మరింత సమాచారం కొరకు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఏఏ భారతి ప్రకృతి సేద్య సిఆర్పి సురేష్ గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ