ఏలేశ్వరం లో అమ్మవారికి ఘనంగా చీర సరే సమర్పించిన భక్తులు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: శరన్నవరాత్రుల్లో భాగంగా ఏలేశ్వరం పలు వీధుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవ మండపాల్లో ఆదివారం మహాచండి మాత అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక తోటవీధిలో గత 42 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం మహాచండి మాత అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూప దీప నైవేద్యాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా ఉపవాసం ఉన్న భక్తులు చీర సారే వివిధ రకాల వంటకాలను అమ్మవారికి సమర్పించారు.అనంతరం వివిధ శరన్నవరాత్రి ఉత్సవ మండపాలలో నెలకొన్న అమ్మవార్లను భారీ ఊరేగింపుగా మహిళలు తరలి వెళ్ళి దర్శించు కున్నారు. భాజా భజంత్రీలతో,సారే పెళ్ళాంతో మహిళలు బారులు తీరి పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు.దిబ్బలపాలెం చిన్న మాస్టర్ ఇంటివద్ద లక్కవరం కాలనీ లో నెలకొల్పిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి నిర్వహిస్తున్న ఉత్సవ మండపంలో మహా చండి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారి కి ఉదయం ధూప దీప నైవేద్యాలతో భక్తులు విశేష పూజలు అందించారు. అమ్మవారికి చీర సారే సమర్పించిన భక్తులు వీధుల్లో వివిధ మండపాల్లో నెలకొన్న అమ్మవార్లకు చీర, సారే , వివిధ రకాల వంటకాల స్వీట్లు చూపించి పురవీధుల్లో ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తోటవీధి, దిబ్బలపాలెం దేవీ నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు,భారీ సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!