అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…

అప్పసముద్రం దుర్ఘటన బాధిత చిన్నారులకు సీఎం ఆర్థిక సాయం…

చిన్నారుల వైద్య అవసరాలన్నింటికీ భరోసా గా ప్రభుత్వం ఉంటుందన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

ఉదయగిరి సెప్టెంబర్ 17 (మన ద్యాస న్యూస్)://

ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణాసంచా పేలుడు కారణంగా తొమ్మిది మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసిందే.ఈ సంఘటనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. దీని ఫలితంగా, బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను ఈ రోజు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తో కలసి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ తనవంతు సహాయం అందిస్తానని, అలాగే గాయపడిన చిన్నారులకు భవిష్యత్తులో వైద్య అవసరాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే, ప్రభుత్వం తరఫున తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీఇచ్చారు.ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని, అలాగే సంబంధిత అధికారులకు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసే విధంగా కఠిన నిబంధనలు చర్యలను తీసుకోవాలని, ఆదేశించారు. గ్రామాలలో జరిగే ఉత్సవాలలో వేడుకలలో తల్లిదండ్రులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అది మనందరి బాధ్యత అని అన్నారు. అలాగే గాయపడిన పిల్లల వైద్య చికిత్స కోసం ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల వెన్నంటి ఉంటుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    దుత్తలూరు, సెప్టెంబర్ 17: (మన ద్యాస న్యూస్) :/// దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదాల తిమ్మయ్య గారి తల్లి శ్రీమతి మంగమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట…

    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

    • By mananews
    • September 17, 2025
    • 6 views
    విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

    కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

    • By mananews
    • September 17, 2025
    • 13 views
    కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

    అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…

    • By NAGARAJU
    • September 17, 2025
    • 4 views
    అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…

    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    • By RAHEEM
    • September 17, 2025
    • 4 views
    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    • By NAGARAJU
    • September 17, 2025
    • 4 views
    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 7 views
    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు