రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితి..టిడిపి నగర అధ్యక్షులువట్టికుంట చినబాబు

మన న్యూస్,తిరుపతి :;- పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు చెప్పారు. గురువారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చినబాబు మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో తోతాపురి మామిడికాయలను కిలో 16 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని జగన్ రెడ్డి చెప్పడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలో తోతాపూరి పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేసే దిక్కు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు లేఖ రాశారని గుర్తు చేశారు. గత మూడు నెలల గురించి ఏనాడు రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు ఉన్నట్లు ఉండి రైతుల మీద ప్రేమ ఓలకపొస్తున్నట్లు నటించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పలనాడు పర్యటనలో జగన్ రెడ్డి సింగయ్యను కారుతో తొక్కించి చంపిన ఘటన ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. బంగారుపాలెం మండలంలో జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా అదే పార్టీకి చెందిన ఓ రైతుకు చెందిన మామిడికాయలను రోడ్లమీద పోయించి ధరలు లేక రైతులు రోడ్లమీద పోశారని బూటకపు నాటకాలు ప్రజలందరూ తెలుసుకున్నారు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో విధ్వంశాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, అలాంటి కుట్రలను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి పర్యటన దండయాత్రకు బల నిరూపణకు వచ్చినట్లే ఉంది గాని రైతులకు పరామర్శించడానికి వచ్చినట్లు ఏ కోశానా కనపడలేదన్నారు. జగన్ రెడ్డి పర్యటనకు ముందే స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి అవగాహనతో వచ్చి ఉండాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా న్యాయబద్ధంగానే ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశామే కానీ, ఏనాడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదన్నారు. పలు అవినీతి, అక్రమస్తుల 11 కేసులలో ముద్దాయిగా ఉన్నాడని త్వరలో జైలుకుపోవడం ఖాయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని జోష్యం చెప్పారు. బంగారుపాళ్యం పర్యటనలో ఓ మీడియా ప్రతినిధి పై వైసీపీ నేతలు దాడులు చేయడం పై వెంటనే గాయపడిన ఫోటోగ్రాఫర్ శివ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి తగు న్యాయం చేయాలని వట్టికుంట చిన్నబాబు డిమాండ్ చేశారు.

Related Posts

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాయినాధుని ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతుపాలెం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ సిబిఎన్ కోఆర్డినేటర్ యాళ్ళ జగదీశ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది