విద్యార్థులు చిన్నప్పటినుంచే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలి….రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి :– విద్యార్థులు చిన్నప్పటినుండే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విద్యార్థులకు సూచించారు. గురువారం ముత్యాల రెడ్డి పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ఎంతసేపు చదవమని చెప్పకుండా వారికి క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా చూడాలన్నారు. విద్యార్థులు గురువుల పట్ల గౌరభావంతో పాటు భక్తి భావం కలిగి ఉండాలని అప్పుడే విద్యార్థులకు చదువు వంట పడుతుందని పేర్కొన్నారు. హైస్కూల్లో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పరచాలని, మధ్యాహ్న భోజన పథకంలో మంచి నాణ్యత కలిగి ఉండాలన్నారు. పిల్లలకు తాగేందుకు అవసరమైన తాగునీరు మినరల్ వాటర్ తో పాటు మరుగుదొడ్లు పరిశుభ్రముగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడులకు కావలసిన వసతులను సమకూరుస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల ప్రోత్సాహంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ గా తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. హై స్కూల్ లోని మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..