ఎస్.ఆర్.పురం మండలంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

ఎస్.ఆర్.పురం,మన న్యూస్ , జూలై 10:– ఎస్.ఆర్.పురం మండలంలోని కటికపల్లి పంచాయతీలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం బుధవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు , గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని స్వయంగా సందర్శించి, ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అమలు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా పింఛన్లు, రైతు భరోసా,తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు పాటుపడుతున్న విధానాలపై రూపొందించిన కరపత్రాలను ప్రతీ ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. ప్రజలతో మమేకమవుతూ నాయకులు వారి సమస్యలను, అభిప్రాయాలను నేరుగా స్వీకరించడం జరిగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ కార్యకలాపాలపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం సభ్యులు మరియు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. “సుపరిపాలన తొలి అడుగు” అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే పాలనకు మార్గం సుగమం చేస్తున్నామన్న సందేశాన్ని నాయకులు పునరుద్ఘాటించారు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించబడతుంది. ప్రజల అభ్యున్నతికే తమ అంకిత భావంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయడమే తమ లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు తెలుగు యువత అధ్యక్షులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!