రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా కాకి నాని…

  • కాకి నాని పదవి తో ఏ. మల్లవరం లో సంబరాలు
  • మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివ కుమారి

శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) :- రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన కాకి లక్ష్మణ మూర్తి (నాని) నియమితులవడం పట్ల నాని తన స్వగ్రామమైన ఏ మల్లవరం గ్రామంలో నాని నివాసంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కాకి లక్ష్మణరావు (నాని ) రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి నాని నివాసంలో నానికి శాలువ వేసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. నాని నివాసంలో లక్ష్మి శివకుమారి మాట్లాడుతూ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ప్రత్తిపాడు నియోజకవర్గానికి వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. మారుమాల గ్రామమైన ఏ మల్లవరం గ్రామంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి నన్ను ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి చట్టసభలకు పంపించారని, ఇదే గ్రామం నుండి నానిని వైయస్ జగన్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ముద్రగడ, వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాలతో నానిని నియమించడం సంతోషకరమన్నారు. మా గ్రామం నుండి ఎంతోమంది రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని మా గ్రామ ప్రజలు మాపై చూపిస్తున్న అభిమానం మరవలేనిది అన్నారు. ఈ పదవులు రావడానికి మల్లవరం గ్రామ ప్రజలే కారణమని ప్రజలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ ఇండియా మిషన్ కాకినాడ జిల్లా అధ్యక్షురాలు కొంకిపూడి రాజ్యలక్ష్మి దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గునపర్తి అపురూప, దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తిన తాతాజీ మాజీ సర్పంచ్ నాకిరెడ్డి అప్పలనాయుడు, బీమిరెడ్డి రామకృష్ణ, గవిరెడ్డి రాజబాబు, పలివెల శివ, అడిగర్ల సత్తిబాబు,కాకి పెదకాపు, కాకి వీర సత్యనారాయణ, లోకవరుపు ఏసుబాబు, నాకిరెడ్డి గోవింద్, బొడ్డు నాని తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి