సోలార్ వినియోగం పై గ్రామస్థాయి లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్

Mana News :- తిరుపతి, నవంబర్ 12 ,(మన న్యూస్ ) :- సోలార్ ఉత్పత్తి, వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై జిల్లా నెడ్ క్యాప్ మేనేజర్ దిలీప్ కుమార్ రెడ్డి,ఏ పి ఎస్ పి డి సి యల్, ఎస్ ఈ. సురేంద్రనాయుడు, జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలదేవి, నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు రెడ్డిల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ ఉత్పత్తి మరియు వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబందిత అధికారులకు సూచించారు. సోలార్ వినియోగంవల్ల కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకొచ్చేందుకు సంబందిత అధికారులు ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకొచ్చాయని ఇందులో భాగంగా పి.ఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం ను జిల్లాలో అమలుపరచడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ గా మరియు ఆరుగురు మెంబర్లుగా జిల్లా పరిషత్ సి.ఈ. ఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.పి.డి.సి.ఎల్, జిల్లా నెడ్ క్యాప్ అధికారి, మరియు ఇతర సిబ్బందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సదరు కమిటీ పీ.ఎం. సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన అమలును పర్యవేక్షిస్తుంది అని తెలిపారు. జిల్లా లో 5 వేల మంది జనాభా కలిగిన గ్రామాలను గుర్తించాలని జిల్లా పంచాయతీ అధికారిణి కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 19 న నిర్వహించే జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో గ్రామాలను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు స్వయంగా తామే తమ ఇంటి పై భాగంలో సౌర విద్యుత్ తయారు చేసుకునే మరియు వినియోగించుకునే వెసులుబాటును కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తూ స్తోందన్నారు. అందుకు ఆసక్తి గలవారు దరఖాస్తును పి.ఎం సూర్య ఘర్ పోర్టల్ నందు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఒక కిలో వాట్ కు 30 వేల రూపాయలు, రెండు కిలో వాట్ లకు 60 వేల రూపాయలు, మూడు కిలో వాట్ లు మరియు ఆ పైన యూనిట్లకు 78 వేల రూపాయలు కేంద్రం నుండి రాయితీ వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ అవుతుంది అని తెలిపారు. 100 కిలో వాట్లు పైబడిన ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్.వి.వి. ఎన్ మరియు నెడ్ క్యాప్ ఫేజ్ -1 లో సౌర విద్యుత్తు ప్లాంట్లు అమర్చడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. మోడల్ సోలార్ విలేజ్ కోసం 5 వే లు జనాభా కలిగిన 5 గ్రామాలను గుర్తించి వాటిని సోలార్ గ్రామాలుగా తీర్చి సిద్ధేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.సోలార్ విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగించుటకు ఇప్పటికే జిల్లాలో 122 ప్రభుత్వ కార్యాలయాల ను గుర్తించడం జరిగిందని జిల్లా నెడ్ క్యాప్ మేనేజర్ కలెక్టర్ కు తెలియజేశారు.

Related Posts

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీవ్ర గాయానికి దారి తీసింది. ఈ ఘటనలో తన్నీరు రవి (45) కూలీ పని చేసుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.శనివారం…

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు బృందావనంలో ఫోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ లో జ్యోతి ప్రజ్వలన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి