నెల్లూరు జిల్లాకు అధిక నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంకు ధన్యవాదాలు

నెల్లూరు జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

Mana News :- కోవూరు,మనన్యూస్,నవంబర్ 12) :- కోవూరు లోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ………..2024- 25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లోఅభివృద్ధికి,సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది అని అన్నారు.గత వైసిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయించింది అని అన్నారు.ఈ బడ్జెట్ లో నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు అని అన్నారు.అనముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ రంగానికి, ఈ బడ్జెట్ లో అధికంగా నిధులు కేటాయించారు అని అన్నారు.తెలుగుగంగ ప్రాజెక్టు కోసం మొత్తం రూ 880 కోట్లు కేటాయించగా,అందులో ఈ ప్రాజక్టు పరిధిలోని నెల్లూరు,తిరుపతి జిల్లాల కు రూ.422 కోట్లు కేటాయించారు అని అన్నారు.సోమశిల ప్రాజెక్టు కొరకు రూ.210 కోట్లు,పెన్నార్ డెల్టా కెనాల్ సిస్టమ్ అభివృద్ధి కొరకు రూ.33.42కోట్లు,సోమశిల,స్వర్ణముఖి లింక్ కెనాల్ కు 66 రూ. కోట్లు,కండలేరు లిఫ్ట్ కెనాల్ కొరకు 11కోట్లు,కనుపూరు కెనాల్ కొరకు రు.7 కోట్లు కేటాయించారు అని అన్నారు.అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రజాక్టుకు రూ.393 కోట్లు కేటాయించడం వలన మన జిల్లాలోని మెట్ట ప్రాంతం రైతులకు ప్రయోజనం కలుగుతుంది అని అన్నారు.మొత్తం మీద గతములో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో భారీగా నిధులు దక్కాయి అని అన్నారు.అదే విధంగా రామాయపట్నం,కృష్ణపట్నం పోర్టు ల అభివృద్ధికి,నెల్లూరు నగరంలోని భూగర్భ డ్రైనేజీ,త్రాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు,అదేవిధంగా జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు అని అన్నారు.ఈ బడ్జెట్లో నెల్లూరు జిల్లా కు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగాలకు నిధులు ఎక్కువ కేటాయించిన ముఖ్యమంత్రి కి మంత్రులకు జిల్లా తెలుగుదేశం పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియచస్తున్నాము అని అన్నారు.

  • 2024.25 సంవత్సరానికి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నెల్లూరు జిల్లా కు అధిక నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • *గత వైసిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ కు భారీగా నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం.
  • *రామాయపట్నం,కృష్ణపట్నం పోర్టు ల అభివృదీకి నిధులు కేటాయింపు. *జిల్లాకు అధిక నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కు ధన్యవాదాలు.
  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!