

నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు
నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు,జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
మనన్యూస్,కామారెడ్డి: 17 తేదీ10 నెల 20 సంవత్సరం నాడు పిర్యాదురాలు అయిన కర్రె బాలామణి భర్త పెంటయ్య వయసు 35 సం.మాల్తుమ్మెద గ్రామం నాగిరెడ్డిపేట మండలం తన తండ్రి అయిన కర్రె రామకృష్ణయ్య కు మరియు కులస్తులైన కర్రె రాజయ్య గార్లకు కొన్ని సంవత్సరాల నుండి భూమికి సంబంధించిన గొడవలు ఉన్నయి కావున ఈ గొడవ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని కర్రే రామకృష్ణయ్య (మృతుడు) మరియు నా కొడుకు కర్రే ప్రవీణులము కలసి కర్రే రాజయ్య నిందితుడు ఇంటికి వెళ్లి ఇట్టి విషయంలో పెద్దమనుషు సమక్షంలో మాట్లాడుతుండగా అకారణముగా మా నాన్నగారిని చంపాలని ఉద్దేశంతో కర్రతో గట్టిగా తల పైన,నడుం పైన కొట్టగా మా నాన్నగారు అక్కడనే పడిపోయినాడు.వెంటనే మేము ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి తరలించమని చెప్పగా కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించినాడు కర్రే రామకృష్ణయ్య మృతుడు కొట్టి హత్య చేశారని ఫిర్యాదు మేరకు నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగినది.పరిశోధనలో భాగంగా మృతుని ఇంటి ప్రక్కన, గ్రామస్తులను,కులస్తులను విచారించి కర్రే రామకృష్ణయ్య ను నేరస్తునిగా గుర్తించి అరెస్టు చేయడం జరిగింది ఈ విషయములో నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ నిందుతునికి జీవిత ఖైదు మరియు పది వేల రూపాయల జరిమాన జరిమాన విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది.
ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి ఎల్లారెడ్డి సిఐ రాజాశేఖర్,ఏఎస్ఐ సుబ్రహ్మణ్య చారి,పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్ కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత సిఐ రవీంద్ర నాయక్,ప్రస్తుత ఎస్ఐ మల్లారెడ్డి,కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ టి.మురళి,కోర్ట్ కానిస్టేబుల్ సాయిలు లను జిల్లా ఎస్పీ అభినందించారు.
