

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ చదివి వెళ్లిన ఎక్కడ వెళ్లిన క్రమశిక్షణతో ఉండి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు కోరారు.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు యాదవ్ శంకర్, లలిత, సుజాత, సునీత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.