కొన్ని సంవత్సరాలుగా సమస్యలో ఉన్న సచివాలయ భవనాన్ని కాంట్రాక్టర్ మండల ఎంపీడీవోకు అప్పగింత.

బంగారు పాళ్యం మార్చి 6 మన న్యూస్

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జిల్లేడుపల్లి పంచాయితీ పరిధిలో గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సచివాలయ భవనాన్ని 40 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. ఈ భవనానికి కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి తన సొంత స్థలంలో, సచివాలయ భవనానికి స్థలం ఇచ్చి అతనే భవనాన్ని కాంట్రాక్టర్ తీసుకొని నిర్మాణం చేశారు. కానీ ఆయనకు రావలసిన డబ్బులలో 11 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నందువల్ల, ఎన్ఆర్ఈజీఎస్ వారు బిల్లులు కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డికి ఇవ్వకపోవడంతో గత కొన్ని నెలలుగా భవనాన్ని పంచాయతీ వారికి ఇవ్వలేదు. ఈ తరుణంలో గత రెండు రోజుల క్రితం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, మండల అభివృద్ధి అధికారి,, తహసీల్దారు వెళ్లి సచివాలయ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లులు సకాలంలో పూర్తిగా అందించినట్లు, బిల్లులతో సహా కాంట్రాక్టర్ కు వివరించడంతో తమకు సచివాలయ భవనాన్ని స్వాధీనం చేయాలని తెలపడంతో, 06-03-2025 వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి సచివాలయ భవనాన్ని, భవనానికి ఉన్న తాలాన్ని ఎంపీడీవో శ్రీధర్ కు జిల్లేడుపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వేణు రెడ్డి ద్వారా అందజేశారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా నడచిన సచివాలయ భవన తగాదాలు ఒక కొలిక్కి రావడంతో, జిల్లేడుపల్లి పంచాయతీ లో వివాదం సద్దుమణిగింది . కాంట్రాక్టర్ ఎవరు పెండింగ్ పనులు ప్రారంభించిన, (లేక) కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి ప్రారంభించిన వెంటనే ఐదు లక్షల రూపాయలకు పై అధికారులతో సంప్రదించి ప్రపోజల్ పంపించి మిగిలిన పనులు పూర్తిచేసే వారికి పనులు ఇస్తామని ఇన్చార్జి ఎంపిడిఓ శ్రీధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు తొందరలో సచివాలయ భవనాన్ని శంకుస్థాపన చేయాలని మండల ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి భారతమ్మ, మాజీ సర్పంచి జె. అశోక్ రెడ్డి, కొత్తూరు భాను ప్రకాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, చిట్టి రెడ్డి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ