

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 11,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ,ఆర్థిక ,విద్య,ఉపాధి,రాజకీయ, మరియు కుల సర్వే ప్రభుత్వం చేపడుతుంది. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి శిరీష ఇంటి వద్దకు వెళ్లి ఎంతమంది కుటుంబలు ఉన్నారు. ఆధార్ కార్డులతో సహా సర్వేలు రాయడం జరుగుతుందని అన్నారు. ప్రజల వద్ద వెళ్లి వివరాలు ఏ విధంగా చెబితే ఆ విధంగానే రాయడం జరుగుతుందని ఆమె అన్నారు. పంచాయతీ కార్యదర్శి వెంట కరోబర్ లింగాల రాములు, తదితరులు ఉన్నారు.