ఘనంగా వాకర్స్ కార్తీక వనభోజనమహోత్సవం

తిరుపతి, నవంబర్ 11, (మన న్యూస్ ) :- తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాకర్స్ సభ్యులతో కార్తీక వనభోజనమహోత్సవాన్ని వడమాలపేట మండలం ఉమామహేశ్వరాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేసారు.
ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో ఎన్నో వాకర్స్ అసోసియేషన్లు ఉన్న వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం చేస్తున్న సామజిక కార్యక్రమాలు ఎవ్వరికీ సాటిరారని తెలిపారు. సుమారు 300 మంది సభ్యులతో కలసి శివునికి అభిషేకించి తీర్థప్రసాదాలను వాకర్స్ కు అందజేశారు. ఆలయం ఆవరణంలోనే భోజనాలు వండి అందరికి వడ్డించారని తెలియజేసారు.చివరగా వాకర్స్ సభ్యులకు జ్ఞాపిక ను , నూతన సంవత్సర డైరీ, కాలెండర్ల ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ బండ్ల సోమేశ్ , వి. జగన్నాధం , వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బాలాజీ , శివారెడ్డి , సాయి కృష్ణంరాజు, చంద్ర ,నరసింహయ్య ,శాంతి, పుష్పలత, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.