చలో తునికి బయలుదేరిన మురళి రాజును అడ్డుకున్న పోలీసులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు :
మాజీమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ రాజు మంగళవారం చలో తుని కార్యక్రమంకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో బయలుదేరుగా స్థానిక పోలీసులు ధర్మవరం మెయిన్ రోడ్డుమీద అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసులు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ లక్ష్మీకాంత వైసిపి నాయకులు మురళి రాజు తుని వెళ్తే 144 సెక్షన్ అమల్లో ఉందని అరెస్టు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం మురళి రాజు భారీ వైసిపి శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు మద్దతుగా తుని బయలుదేరి వెళ్లారు. అలాగే గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబు, రామచంద్రపురం నియోజవర్గం ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్, ముదునూరి మురళి రాజులు తుని బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మురళి రాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపికి మెజారిటీ లేకపోయినా వైసిపి కౌన్సిలర్లు లాక్కోవడానికి చేసే ప్రయత్నం చాలా దారుణం అన్నారు. ఈ ప్రయత్నాన్ని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సమర్థవంతంగా అడ్డుకున్నారన్నారు. దీంతో చేసేదిలేక కుటమి ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయించిందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు