

మనన్యూస్,గద్వాల:జోగులాంబ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై సోమవారం గద్వాల పట్టణ పోలీసులు దాడులు చేశారు.గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు నిర్వహించారు.ఈదాడిలో కడపజిల్లా కు చెందిన నిర్వాహకుడితో పాటు,అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఓ మహిళ,కర్నూల్ జిల్లాకు చెందిన మరొక మహిళ దొరకగా ముగ్గురు విటులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 7 సెలఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై కళ్యాణ్ రావు తెలిపారు.