

మనన్యూస్,ఎల్,బి,నగర్:అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ అండర్ 11 గర్ల్స్ డబుల్స్ విభాగంలో మ్యాచ్ పాయింట్ అకాడెమీ క్రీడాకారిణులు లట్టాల శాన్వి,ఎవిలిన్ ప్రియాంక్ జోడి అద్భుతమైన ఆటతో బంగారు పతకం గెలుచుకున్నారు క్వార్టర్ ఫైనల్స్ లో గోపిచంద్ అకాడమీ క్రీడాకారులు అధ్యా రెడ్డి,హరిని హోట మీద 16/14,15/4 తో సెమి ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ బ్యాడ్మింటన్ అకాడెమీ క్రీడాకారిణులు నిధిత రెడ్డి,పీయూష జోడి మీద 21/14,21/07 స్కోర్ తో గెలిచి ఫైనల్స్ కి చేరుకున్నారు.ఫైనల్స్ లో భాస్కర్ బాబు అకాడెమీ క్రీడాకారిణులు సైనా శర్మ, కన్విక జోడి మీద 21/11,12/21,21/19 స్కోర్ తో గెలిచి టౌర్నమెంట్ విన్న్రర్స్ గా నిలిచారు.57 నిమిషాల పాటు నువ్వా నేనా అని సాగిన మ్యాచ్ లో చివరకు మ్యాచ్ పాయింట్ జోడి విజేత గా నిలిచింది.మ్యాచ్ చివరి వరకు ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా ఎంతో ఉత్సాహంగా తిలకించారు.ఏఐజి హాస్పిటల్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి,పుల్లెల గోపిచంద్,అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ బహుమతులు అందచేశారు.గోల్డ్ మెడల్ గెలిచుకున్న శాన్వి లట్టాల ఎవిలిన్ ప్రియాంక్ జోడి కాష్ అవార్డ్ తో పాటు ట్రోఫీ,బజాజ్ గిఫ్ట్ హాంఫర్ కూడా గెలుచుకున్నారు.మ్యాచ్ పాయింట్ ఫౌండర్ చైర్మన్ వేణు ముప్పాల మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు,కోచ్ జె బి.ఎస్ విద్యాధర్,కోచ్ భీమరశెట్టి రాధా కృష్ణకీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.