రైతుల సొంత డబ్బులతో.. జీరో డిస్ట్రిబ్యూటరి కాలువ మరమ్మత్తులు..

మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి చూస్తే అధికారుల పనితీరుపై మండిపడతారు రైతులు. 93 ఏళ్ల క్రితం ప్రారంభానికి నోచుకున్న ఈ నిజంసాగర్ జీరో ఉపకాల్వకు ఒక్క రూపాయి వెచ్చించిన పాపం పోలేదు. కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 62 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అని చెప్తుండగా, 2016లో నాబార్డు కింద నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆధునికరణ, ఉపకల్వల మరమ్మత్తుల కోసం 262 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో 2022 వరకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఇరిగేషన్ శాఖ రికార్డులు చూపుతున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పుడు ప్రధాన కాల్వ వద్ద జీరో ఉపకాలవ ఎందుకు బాగు చేయలేదని రైతుల నుంచి వస్తున్న ఆరోపణలు. శిథిలమైన తూము, కాలువలో పేరుకుపోయిన పూడిక, పిచ్చి మొక్కలతో కాల్వ నామరూపాలు లేకుండా కనిపిస్తుంది. ఈ కాల్వ పై ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యపు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు కాల్వల బాగుకోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని బాగు చేయాల్సి ఉండగా నిధులను మింగేస్తూ చేతులు ఎత్తివేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయంలో 562 కోట్ల రూపాయలు మంజూరు కాగా, 2016లో నాబార్డ్ కింద కేంద్ర ప్రభుత్వం 262 కోట్లు నిధులు మంజూరు చేసింది నిజం సాగర్ కాల్వల బాగుకోసం. కానీ క్షేత్రస్థాయిలో నిజాంసాగర్ మొదలుకొని అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం వరకు ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ, ఉపకల్వల దుస్థితి చూస్తే ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. నిజం సాగర్ ప్రధాన కాలువ వద్దగల జీరో ఉపకాలవ పూర్తిగా శిధిలావస్థకు చేరుకోవడంతో అన్నదాతలు తమ సొంత ఖర్చుతో ఇసుక బస్తాలు వేసి, మీరంతా వృధాగా పోకుండా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా తమ సొంత ఖర్చులతో కాలువల పూడిక కూడా రైతులు తీస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుందని రైతుల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు