కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు

మన న్యూస్: ప్రత్తిపాడు మండలం లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సీఈవో ఒమ్ము కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సొసైటీ పరిధిలో ఉన్న రైతులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ సమావేశమయ్యారు.ప్రత్తిపాడు ప్రాంత పరిధిలోని సహకార సహకార సంఘాలను సందర్శిస్తున్న రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్
ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభని మర్యాదపూర్వకంగా కలిసి సహకార వ్యవస్థ బలోపేతానికి,కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ నిర్ణయాలు గురించి వివరించారు.ఈ సందర్భంగా లంపకలోవ పిఎసిఎస్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి కేంద్ర సహకార మంత్రి శాఖ వివిధ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నదని వాటి అమలు ద్వారా సహకార సంఘములు ఆర్థిక వనరులను పెంపొందించుకుని సభ్యుల అవసరాలు మేరకు పనిచేయవలసిన అవసరం ఉన్నదని,ముఖ్యంగా సంఘం నిర్వహణ ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉన్నదని,సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా వారికి అవగాహన పెంపొందించడానికి మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ సంఘ సందర్శన సందర్భంగా ఉద్భోదించినారు.సహకారం ద్వారా ఆర్థిక సమృద్ధి అనే నినాదంలో భాగంగా దేశవ్యాప్తంగా రెండు లక్షల బహుళార్థ సేవలు అందించే సహకార సంస్థలు ఏర్పాటు కానున్నయాన,ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో డైరీ మరియు ఫిషరీస్ సహకార సంఘంలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని గుర్తించి కేంద్ర సహకార మంత్రి శాఖ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని డాక్టర్ శ్రీనివాస్ తెలియచేసారు.వీటి ఏర్పాటులో భారత ప్రభుత్వ సంస్థల అయినటువంటి నాబార్డు ఎన్డిపిడిబి ఎన్సీడీసీ ఎన్నఫ్డిపి వంటి సంస్థలకు మార్గదర్శకాలు సూచించడం జరిపినదని వీటి అమలుకు కేంద్ర స్థాయిలో వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీలు,జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కావడం జరిగినదని డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.