ఐరాల డిసెంబర్ 17 మన న్యూస్

చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని తిరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను,స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని చదును చేసి గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్న కొందరికి కేటాయించడానికి గ్రామ పెద్దలు,స్థానిక ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయించిన తర్వాత అక్కడ ఆ భూమిని చదును చేసి అధికారుల ద్వారా వారికి న్యాయం చేయాలన్న సదుద్దేశ్యంతో సాటిస్ఫాక్షన్ క్రమంలో దానిని అడ్డుకోవడానికి కొందరు కుట్రపూరితంగా నిన్నటి రోజున స్థానిక కలెక్టర్ కి తప్పుడు సమాచారంతో ఫిర్యాదు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనిని తిరువనంపల్లి గ్రామస్తులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఖండిస్తూ ఇందులో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని,గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు న్యాయం చేయాలన్న మంచి ఉద్దేశంతోనే అందరు కలిసి నిర్ణయించుకున్నారని కావున జిల్లా కలెక్టర్,స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు డా మురళీ మోహన్ ,మరియు ఐరాల ఎమ్మార్వో సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై త్వరలో అందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారిని పూతలపట్టు శాసనసభ్యులను ఎమ్మార్వో గారిని కలిసి లిఖితపూర్వకంగా విన్నవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,తిరువణంపల్లి గ్రామస్తులు,గ్రామ పెద్దలు, యువకులు, టీవిపి యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed