సింగరేణిలో భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐటీడీఏ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

మన న్యూస్:పినపాక,నియోజకవర్గం సింగరేణిలో భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో అధికారులకు హెచ్ డేవిడ్ రాజు సహాయ ప్రాజెక్టు అధికారి కి వినతి పత్రాలు అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా ఎస్ఎంఎస్ ప్లాంట్ (ఎక్సప్లొజివ్స్) ఇతర సింగరేణి సివిల్, పర్చేస్ విభాగపు పనులలో పలు ఖాళీలు ఉన్నాయి. అయితే కాంట్రాక్టర్లు అట్టి పనులను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ పనులలో కాంట్రాక్టర్ అమ్ముకున్న విషయాన్ని సాక్షాధారాలతో సహా నిరూపించాను దయచేసి ఎస్ఎంఎస్ ప్లాంట్, ఇన్ చార్జ్ నరసింహస్వామి,ఓసి-2 ఆయిల్ బ్యారెల్స్ లోడింగ్ అన్ లోడింగ్ (కాంట్రాక్టర్ మునిగల రమేష్ బాబు) ఇతర పనులలో మణుగూరు ఓసి ప్రభావిత గ్రామమైన తిర్లాపురం గ్రామ నిరుద్యోగులకు తొలి ప్రాధాన్యతగా కొత్త మల్లేపల్లి, న్యూ ఎగ్గడి గూడెం,అయోధ్య నగర్, కొత్త కొమ్ముగూడెం, కొత్త కొండాపురం, కొత్త పద్మ గూడెం, మదీనా నగర్, రైల్వే స్టేషన్ బీసీ కాలనీ,జయశంకర్ నగర్, కెసిఆర్ నగర్ గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాల నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించే విధంగా, పైన తెలిపిన పిడిఎఫ్ లతోపాటు పి ఏ పి లు, సింగరేణి కార్మికుల వారసులు స్థానికులకు ఓబి కంపెనీలలో (దుర్గా, మహాలక్ష్మి) 80% ఉపాధి కల్పించే విధంగా తమరు న్యాయం చేయాలని కోరుతున్నాను.అలాగే సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ విభాగంలో డబ్బులు కట్టి నష్టపోయిన నలుగురు నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించాలని అధికారులను వినతిపత్రంలో కోరినట్లు ఆయన తెలిపారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి