మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను మండల ప్రత్యేక అధికారి వామన్ రావు పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపిఓ శివ కుమార్, సర్పంచ్ సంకు లక్ష్మయ్య,నాయకులు బంగ్లా ప్రవీణ్ , బలరాం, పంచాయతీ కార్యదర్శి తుకారం తదితరులు ఉన్నారు.