మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్. మండలంలోని గున్కూల్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నారని అందిన సమాచారంతో నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ పోలీస్ సిబ్బంది తో కలిసి రైడ్ నిర్వహించారు.
రైడ్ సమయంలో ఐదుగురు వ్యక్తులు చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు ,రూ.37,670 నగదును సీజ్ చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పేకాట,ఆన్ లైన్ మట్కా, జూదం,పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.ఎస్ఐ శివకుమార్ తోపాటు పోలీస్ సిబ్బంది వీరభద్ర, రవి, అన్వేష్, ప్రవీణ్ ఉన్నారు.