పెద్దనాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మెగాపేరెంట్స్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ 3.0 కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,జనసేన నాయకులు మేడిశెట్టి బాబి,మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి,నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే సత్యప్రభను స్కౌట్, మార్చ్ తో ఘన స్వాగతం పలికారు.పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీట్ లోఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకులతోకలిసి పాల్గొన్నారు. ముందుగా పాఠశాల విద్యార్థులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతోకార్యక్రమం ప్రారంభిచారు.విద్యార్థినులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే పలు విషయాలు పట్ల అవగాహన ప్రదర్శన చేపట్టారు.గొల్లపల్లి బుజ్జి పాఠశాల విద్యార్థులకుసమకూర్చిన క్రీడా దుస్తులను ఎమ్మెల్యే సత్యప్రభ విద్యార్థులకు అందజేశారు.ఐ సి డి ఎస్ సి డి పి ఓ పద్మావతి ఆధ్వర్యంలో చేపట్టిన చైల్డ్ మ్యారేజ్ పై అవగాహన కల్పిస్తూ ప్రమాణము చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని కొనియాడారు. ప్రభుత పాఠశాలలో చదువుకొనే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు.విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధ వహిస్తూఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం లో పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ,కూటమి శ్రేణులు సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్ వర్మ, తాసిల్దార్ కుసరాజు,డిప్యూటీ ఎంపీడీవో రామరాజు వర్మ,సిడిపిఓ పద్మావతి,సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశరావు ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు,సొసైటీ అధ్యక్షులు సూతి భూరయ్య, పెంటకోట మోహన్,కొప్పుల బాబ్జి, శెట్టి చిన్న,సంకర సత్యనారాయణ, పలువురు కూటమ పార్టీ శ్రేణులు విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు హాజరయ్యారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం