పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు

చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5

స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో చిత్తూరు నగరం శివారులోని పీఈఎస్ పబ్లిక్ పాఠశాల మొదటి ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో ఎడ్యుకేషన్ న్యూస్ నెట్వర్క్ సంస్థ చేతుల మీదుగా పీఈఎస్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ వైవి కృష్ణబాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణబాబు మాట్లాడుతూ గత ఏడాది సైతం తమ పాఠశాలకు మొదటి ర్యాంకు రావడం జరిగిందన్నారు. రెండవసారి కూడా పాఠశాలకు మొదటి ర్యాంకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ ర్యాంకు రావడానికి పిల్లల నైపుణ్యం, తల్లిదండ్రుల తోడ్పాటు, ఉపాధ్యాయుల కృషి, యాజమాన్యం యొక్క సూచనలే కారణమన్నారు. తమ పాఠశాలలో సుక్షితులైన అధ్యాపకులను నియమించుకోవడం, అత్యాధునిక బోధనా పద్ధతులను అమలు చేయడంలో రాజీ పోయే ప్రసక్తే లేదన్నారు. తమ పాఠశాల నంబర్ వన్ ర్యాంకు సాధించడానికి సహకరించిన పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం