ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మృత్తిక దినోత్సవను పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్, వృక్షశాస్త్ర మరియు రసాయన శాస్త్ర విభాగం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎన్‌జి‌ఓ ఏలేశ్వరం మండల విభాగం ఆద్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వర రావు అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ప్రకృతిలో ఉన్న సహజ విధానాలను ఉపయోగించి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలను సాగు చేసే విధానం ద్వారా పంటలు పండించడం చాలా అవసరమని, మట్టి ఆరోగ్యం, కాపాడడం మనందరి భాద్యత అని, నేలతల్లి ద్వారా మాత్రమే జీవరాశికి ఆరోగ్యం సంబవిస్తుందని ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా సాద్యమాని తెలియజేశారు. డా. ప్రయాగ మూర్తి ప్రగడ మాట్లాడుతూ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాకృతిక వ్యవసాయం పెరుగుతోందని . ఆంధ్రప్రదేశ్‌లో దీనిని ఎపిసిఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ సహజ వ్యవసాయం) పేరుతో పెద్ద స్థాయిలో అమలు చేస్తున్నారని, రసాయనిక ఎరువులు వాడకుండా రసాయన ఖర్చులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని , మట్టి ఆరోగ్యం మెరుగవుతుందని , పంటల నాణ్యత పెరుగుతుందని , నీటి వినియోగం తగ్గుతుందని , రైతులకు లాభదాయకం, పర్యావరణానికి స్నేహపూర్వకమైన వ్యవస్థ ఆరోగ్యకరమైన ఆహారం జీవ వైవిద్యం లో కొన్ని జీవులు అంతరించకుండా కాపాడగలుగుతామని ప్రతి ఒక్కరినీ ప్రకృతి వ్యవసాయంపై చైతన్య పరచాలని విద్యార్డులకు కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎన్‌జి‌ఓ ఏలేశ్వరం మండల కోఆర్డినేటర్ మజ్జి నాగేశ్వర రావు మాట్లాడుతూ జీవామృత,ఘన జీవామృతం, నీమ్ పచ్చడి తయారీ ప్రాకృతిక వ్యవసాయ ప్రయోజనాలు మొదలైన అంశాలు తెలియజేశారు. కార్యక్రమంలో అద్యపకులు వి రామ రావు కె. సురేష్. ఎస్‌కే మదీనా, డా. శివప్రసాద్. వీరభద్ర రావు, శ్రీ లక్ష్మి,డా. కె బంగార్రాజు,మేరి రొసిలిన, పుష్పా , సతీశ్, మరియు అద్యపకేత సిబ్బంది , పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం