మన ధ్యాస ,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:జిఎస్టి 2.0 సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలుపెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్థులు మరియు రైతులకు జిఎస్టి 2.0 ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ….. ట్రాక్టర్ల పై 12 శాతం వున్న జిఎస్టి 5 శాతానికి తగ్గడంతో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు. హార్వెస్టర్, రోటావేటర్ లాంటి వ్యవసాయ పరికరాలు, ఫర్టిలైజర్సు మరియు పురుగు మందులపై గతంలో 12 నుంచి 18 శాతం వున్న జీఎస్టీ యిప్పుడు 5 శాతానికి తగ్గడంతో రైంతాంగం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్ ఇంజన్లు, ఏరియేటర్లు, స్పింక్లర్ల పై 12 శాతం వున్న జీఎస్టీ 5 శాతానికి తగ్గిందన్నారు. చేపల, రొయ్యల చెరువుల్లో నీటి నాణ్యతకు ఉపయోగించే అమ్మోనియా వంటి రసాయనాలు ఇతర మినరల్స్ పై వున్న 12 శాతం జిఎస్టిని 5 శాతానికి తగ్గించి ఆక్వా రంగానికి అండగా నిలిచారన్నారు. ఆక్వా కల్చర్ కు చెందిన చాలా ఇన్పుట్స్ పై 12 వున్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించి ఆక్వా రంగాన్ని ఆదుకున్న ప్రధాని మోడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆమె ధన్యవాదాలు తెలియ చేశారు. ఉప్పు, పప్పు, సబ్బులు, షాంపూలు, పేస్టులు తదితర నిత్యావసర సరకుల ధరలు తగ్గడంతో పేద, మధ్య తరగతి వర్గాల నెల వారి బడ్జెట్ లో నెలకు 3 నుంచి 5 వేల రూపాయలు అదా అవుతాయన్నారు. జిఎస్టి 2.0 సంస్కరణల ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి మేలు జరిగిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . జడ్పీ వైస్ చైర్మన్ విజయ లక్ష్మీ, జీఎస్టీ కావలి జోన్ అధికారి జ్యోతి, తహసీల్దారు గోపి కృష్ణ, ఎంపీడీవో నాగేంద్ర, ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్ యాదవ్, దేవిరెడ్డి. రవీంద్ర రెడ్డి, సూదలగుంట నాగార్జున, బాబు, బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, జనసేన నాయకులు గుడి. హరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














