పొలం పిలుస్తోంది- వ్యవసాయ శాఖ ఏ ఒ కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు 4 వేల ఎకరాలలో పత్తి పండిస్తున్నారని ఇదంతా కేవలం వర్షాధారంగా మాత్రమే పండిస్తున్నారని అందువలన దిగుబడులు చాలా తక్కువగా వస్తున్నాయని రైతులు కొద్దిపాటి జాగ్రత్తలతో ఒకటి నుంచి రెండు క్వింటాళ్లు దిగుబడి అధికంగా సాధించవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు పేర్కొన్నారు.బుధవారం నాడు తురాయిపాడు గిరిజన గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షధార పత్తి వలన పత్తి పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి అంతర పంటలుగా అపరాలు లేదా చిరుధాన్యాలు వేసుకోవాలని కోరారు.పత్తి చుట్టూ ఒక వరుసలో ఆముదం, రెండు వరుసలలో మొక్కజొన్న మధ్యలో అక్కడ నేలచిక్కుడు వేసుకోవడం ద్వారా కలుపు ఎక్కువగా మొలవకుండా ఉండడమే కాకుండా భూమిలో ఉన్న తేమ శాతాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చన్నారు.దీనివలన అదనపు ఆదాయంతో పాటుగా పత్తి నాణ్యత మరియు దిగుబడి పెరుగుతాయని తెలిపారు.అంతేకాకుండా అంతర పంటలు బహుళ పంటల విధానంలో మిత్ర పురుగుల సంఖ్య పెరిగి పురుగు మందుల పిచికారి ఆవశ్యకత తగ్గుతుందని అలాగే ఎరపంటలు కంచి పంటలు వేయడం ద్వారా పురుగు ఉనికిని కనిపెట్టవచ్చని తెలిపారు. మొక్కజొన్నలో గడ్డి మందు పిచికారి కంటే రెండుసార్లు గొప్పు తవ్వటం ఎంతో ఉత్తమమని కలుపు మందులు నేల స్వభావాన్ని దెబ్బతీయటమే కాకుండా ఏరలను మరియు ఇతర మిత్ర పురుగులను చంపేస్తాయని కాబట్టి అంతర కృషి ద్వారా వేరు వ్యవస్థ దగ్గర గాలి బాగా సోకడం వలన నాణ్యమైన అధిక మొక్కజొన్న దిగుబడులు సాధ్యమని తెలిపారు. అనంతరం టార్పలిన్లు ఆయిల్ ఇంజన్లు పవర్ విడర్లు కావాలని రైతుల కోరారు భూతాల లక్ష్మి మాజీ ఎంపీటీసీ ఎరగడ గంగయ్య గ్రామ వ్యవసాయ సహాయకులు రాకేష్ మరియు లక్ష్మణ్ పాల్గొన్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.