ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను పునరుద్ధరించాలని కోరుతూ కొన్నేళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద మల్లాపురం వెళ్లే రహదారి అత్యంత అధ్వానంగా మారడంతో బస్సు సర్వీసును నిలిపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇటీవల శంఖవరం నుండి పెద మల్లాపురం వరకు కొత్త రోడ్డు నిర్మించారు, దీంతో బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతూ ఈ ఏడాది జులై లో స్థానిక జనసేన నాయకుడు, డి ఆర్ యు సి సి సభ్యులు గొర్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల ప్రజలు కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందించగా, వెంటనే స్పందించిన ఎంపీ ఉదయ్ అప్పటికప్పుడు జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బస్సు సర్వీసు ను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో నేటి నుండి కాకినాడ నుండి కత్తిపూడి మీదుగా వేళంగి వరకు రోజుకు రెండు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరితగతిన స్పందించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు గిరిజన గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి