పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

  • డా. ఎస్ఎస్ రాజీవ్ కుమార్..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
మండల కేంద్రం శంఖవరం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించి, పీహెచ్ లో డెలివరీ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు డాక్టర్ మోహన్ సాయి రెడ్డి వచ్చిన 24 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు చేయగా 7 మందిని హైరిస్క్ ప్రెగ్నెన్సీ గా గుర్తించారు. ఈ సందర్భంగా డా. మోహన్ సాయి రెడ్డి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పౌష్టిక మరియు రక్త హీనత లేకుండా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని, నిత్యం ఆకుకూర, పప్పు దినుసులు, పోషక విలువలు ఉండే ఆహారం స్వీకరించాలని దీని ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. స్టార్ లైట్ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం శంఖవరం మండలం జి కొత్తపల్లి గ్రామ జనసేన పార్టీ నాయకులు కోన సత్తిబాబు భోజన దాతగా వచ్చిన గర్భిణీ స్త్రీలు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ), శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి, గునపర్తి అపురూప్, దంత వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శంకర్, సి హెచ్ ఓ మేరీమణి, పీహెచ్ ఎన్ కృష్ణకుమారి, హెచ్ వి వెంకట లక్ష్మి, ఏఎన్ఎం లు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..