(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏలేశ్వరం మండలం పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా విచ్చేశారు. ఈ సందర్భంగా సత్య ప్రభ మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ క్రిస్మస్ కు నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉందని, క్రిస్మస్ అంటేనే శాంతికి ప్రేమకి నిదర్శనం అని ఆమె అన్నారు. అందరికీ ముందుగా ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముఖ్య ప్రసంగికులు బి. జాన్ రత్నం మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మించిన ముఖ్య ఉద్దేశాన్ని బట్టి ఆయన ప్రపంచాన్ని శాంతి కల్పించడానికి రక్షణ కల్పించడానికి వచ్చి ఉన్నాడని యేసు క్రీస్తు అందరికి దేవుడని, కులానికి,మతానికి చెందిన వ్యక్తి కాదని ఆయన సంబోధించారు. అంతేకాకుండా సర్వ మానవాళికి శాంతి సమాధానం ప్రేమ ఐక్యత కలిగి ఉండాలని ఆ ఉద్దేశాన్ని ఆయన ప్రకటించారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి,కౌన్సిలర్లు అలమండ చలమయ్య,బోదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి, బద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జి, ప్రముఖ ప్రసంగికులు పలివెల ప్రవీణ్ పాల్,పట్టణ ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు, వైద్యులు సౌమ్య, ఏలేశ్వరం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు జాన్ విల్సన్ బాబు, ఫౌండర్ ఎస్ ఏ లేజా, కమిటీ ప్రెసిడెంట్ రెడ్డి ఆనందపాల్, వైస్ ప్రెసిడెంట్ కుంపట్ల పాల్ ప్రసాద్, సెక్రెటరీ సంపత్ ప్రభుదాస్, ట్రెజరర్ వాసా సామ్యేల్, జాయింట్ ట్రెజరర్ పల్లి నెల్సన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పోతల రమేష్, వాసా లాజర్, కొముకూరు సమర్పణ, బత్తిన సునీత పాల్ తదితర మండల పాస్టర్స్ పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *