రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట పరిధిలో గల నర్సింగరావుపల్లి ఎరువుల గోదామును ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో 71 యూరియా బస్తాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా వ్యవస్థను అమలు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.ప్రైవేట్ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.జిల్లా చెక్‌పోస్టుల వద్ద కఠిన భద్రతా చర్యలు చేపట్టి మన జిల్లాకు కేటాయించిన యూరియా రైతులకు మాత్రమే అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా నానో యూరియా వినియోగం పెంచాలని రైతులను చైతన్యవంతం చేయాలని సూచించారు.500 మిల్లీలీటర్ల నానో యూరియా, 45 కిలోల యూరియా బస్తాకు సమానమని,అదనపు రవాణా ఖర్చులు లేకుండా డ్రోన్ ద్వారా సులభంగా పిచికారి చేయవచ్చని ఆయన తెలిపారు.ప్రాథమిక వ్యవసాయ సంఘాలు తమ సొసైటీల వద్ద రైతుల రద్దీ లేకుండా ముందస్తు షెడ్యూల్ ప్రకటనతో యూరియా పంపిణీ నిర్వహించాలని సూచించారు. రైతుల పాస్‌బుక్ ఆధారంగా మాత్రమే అవసరమైన మోతాదులో యూరియా ఇవ్వాలని అధికారులు దృష్టి సారించాలి అని కలెక్టర్ ఆదేశించారు.అలాగే సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా పరిశ్రమలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలరు,ఈ తనిఖీలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ భిక్షపతి, ఏవో అమర ప్రసాద్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి సొసైటీ సీఈఓ సంగమేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు