హసన్‌పల్లిలో తూతూ మంత్రంగా గ్రామసభ – అధికారులు గైర్హాజరు

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:
మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్‌ శాఖ సాయితేజ ఒక్కసారి కూడా గ్రామపంచాయతీని సందర్శించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు స్పందించకుండా ఉండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మురికినీళ్ల కాలువలు శుభ్రం చేయడం లేదని,ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైనప్పటికీ ఇప్పటివరకు తొలగించలేదని మండిపడ్డారు.
గ్రామసభలో విద్యుత్‌శాఖ అధికారులు హాజరు కాకపోవడం కూడా గ్రామ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్పందన లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు.త్వరలో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఆశా కార్యకర్తలు గ్రామంలో తిరుగుతూ సీజన్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.ప్రజలకు అవసరాల నిమిత్తం బీపీ షుగర్ టాబ్లెట్లు అందిస్తున్నామని తెలిపారు.గ్రామ సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకుంటాం,అని పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ హామీ ఇచ్చారు.గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రత్యేక అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రాములు, గ్రామ అధ్యక్షుడు నిఖిల్, కారోబార్ లింగాల రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, ఆశావర్కర్లు నస్రిన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!